MLA Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడియం సీనియర్ ఎమ్మెల్యే.. ఆయన ఎక్కడా బడ్జెట్కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారు అని మండిపడ్డారు.
సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం..? అని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించింది. అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారు.. మా గొంతు నొక్కుతున్నారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
– సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరి పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాష ను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి
– కడియం సీనియర్ ఎమ్మెల్యే.. ఆయన ఎక్కడా బడ్జెట్ కు సంబంధం లేని విషయాలు… pic.twitter.com/Wp4KQXNffs
— BRS Party (@BRSparty) February 14, 2024