జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 26: దేశంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న రాష్ట్ర శాఖ చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి మాటల కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం కర్ణాటక, తెలంగాణాల మాత్రమే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ వైపు ముస్లింలు, క్రిస్టియన్లు, పాకిస్థాన్, చైనావాళ్లు ఉన్నారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ఖాన్కు, అయోధ్య శ్రీరాముడికి మధ్యే పోటీ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో దేశద్రోహులకు, దేశభక్తులకు మధ్య పోరాటం ఉంటుందని తెలిపారు. రేవంత్రెడ్డి చేతగాని, చేవలేని ముఖ్యమంత్రి కావడంతోనే హిందూ బిడ్డ అయిన ఎస్ఐపై మేడారంలో ఓ మైనార్టీ ఎస్పీ దాడి చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణను పగబట్టిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి మూడు నెలల్లో రూ.4,500 కోట్లు దోచుకొని పోయారని, ఎవడబ్బ సొమ్మని ఇంత డబ్బును తీసుకెళ్లారని ప్రశ్నించారు. నెలకోసారి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్ కేసులు మోసుకెళ్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని సోనియా కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని రాకేశ్రెడ్డి విమర్శించారు. ఈ రోడ్షోలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి, పడాల తిరుపతి, టౌన్ అధ్యక్షుడు రంగు గోపాల్, మధన్మోహన్, మండల అధ్యక్షుడు తిరుపతి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.