సంగారెడ్డి : తాగు, సాగునీటి సమస్యలను తీర్చిందేకు గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ప్రణీత్ పనోరమ కాలనీలో మిషన్ భగీరథ పథకం(Mission bhagiratha) ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి రక్షిత మంచినీటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినా ళ్లలోనే నాటి సీఎం కేసీఆర్(KCR) ఆడబిడ్డల కన్నీటి కష్టాలను తీర్చేందుకు వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకంతో తాగు నీటి సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, స్థానిక కౌన్సిలర్ చంద్రకళ గోపాల్, కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.