కొల్చారం/సంగారెడ్డి : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, వసురాంతండా, కొల్చారం, వెంకటాపూర్, పోతంశెట్పల్లి, అప్పాజిపల్లి, కిష్టాపూర్, రాంపూర్, చిన్నాఘన్పూర్, సంగాయిపేట, కోనాపూర్, ఏటిగడ్డమాందాపూర్, రంగంపేట గ్రామాల్లో ఫ్యాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రం వద్దన్నా రైతులు నష్టపోకూడదనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నాడన్నారు. వచ్చే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరిశంకర్, ఆయా గ్రామాల సర్పంచ్లు మంజుల, మన్నె శ్రీనివాస్, కర్రె లచ్చయ్య, సువర్ణ, ఉమ, ఝాన్సీరాణి, గోదావరి, నాగాగరాణి, రాంరెడ్డి, ఇందిర, మానస, సుజాత, విష్ణువర్ధన్రెడ్డి, మాధవి, రమేష్, వీరారెడ్డి, వైస్ ఎంపిటిసీలు అరుణ, భాగ్యలక్ష్మి, ఎల్లయ్య, మండల వ్యవసాయాధికారి బాల్రెడ్డి, గిర్దావర్ శ్రీహరి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేష్, సొసైటీ చైర్మన్లు కృపాకర్రెడ్డి, మనోహర్, మన్నె రాములు, మల్లేశంగౌడ్, ఐకెపి ఏపీఎం సుసిల్వ పాల్గొన్నారు.