జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) అన్నారు. బుధవారం గద్వాల (Gadwal) నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని బల్గేర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, మన ఊరు మనబడి, పల్లె ప్రకృతి వనం, బస్టాండ్, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నాడు కేసీఆర్ పాలనలో ఎలాంటి మధ్యవర్తి లేకుండా సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రశంసించారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి సమన్వయంతో అభివృద్ధిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ బాసు శ్యామల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్త దితరులు పాల్గొన్నారు