జోగులాంబ గద్వాల : వీలైనంత త్వరగా క్రిటికల్ కేర్ బ్లాక్(Critical care block )నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుక రావాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishnamohan Reddy) కాంట్రాక్టర్లకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దౌదరపల్లి సమీపంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు దర్గా వద్ద ఆయుష్మాన్ భారత్లో భాగంగా రెండు ఎకరాల్లో రూ. 23 కోట్ల75 లక్షలతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య రంగానికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నాడు కేసీఆర్ ఎన్నో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి సామాన్యుడికి సైతం అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.