ఆసిఫాబాద్ టౌన్, జూన్ 23 : పోడురైతుల భూములు లాకోవడంకంటే.. ఇకడే అందరినీ చెట్లకు ఉరి తీయండంటూ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడురైతులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పోడురైతులకు పట్టాలిచ్చి అకున చేర్చుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇంతలా గోసపెట్టడం సరికాదని, పోడు రైతులకు న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.