తొగుట, జనవరి 25 : దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన పెద్దమాసాన్పల్లిలో మీడియాతో మాట్లాడారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హరీశ్రావుపై రఘునందన్రావు నోరుపారేసుకోవడం తగదన్నారు. తీరు మారకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో అత్తెసరు మెజార్టీతో గెలిచిన రఘునందన్రావు ఎన్నికల హామీల్లో ఒక్క పనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తాము సీఎం రేవంత్రెడ్డిని కలవడమే పాపమన్నట్టు మాట్లాడుతున్నారని, సీఎం కాంగ్రెస్ పార్టీకా? రాష్ర్టానికా? తెలుసుకోవాలని సూచించారు. ప్రజలకిచ్చిన హామీల కోసం సీఎంతోపాటు మంత్రులను కలుస్తానని చెప్పారు. ప్రధాని మోదీని రేవంత్ కలిసినప్పుడు ఈ నోళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చేస్తే మల్లన్న సాగర్ జలాలు కాలువల పొంటి పారేవని, నేడు పొలాలు ఎండిపోతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసినా కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రధాన కాలువకు సైతం మంత్రి కొండా సురేఖ రాత్రిళ్లు వెళ్లి నీటిని విడుదల చేసి స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించినట్టు తెలిపారు.