చేగుంట, మార్చి 27: ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, సర్కారు వెంటనే స్పందించి ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దతండాలో సుమారు 1800 ఎకరాలకుపైగా ఎండిపోయిన వరి, మక్కజొన్న పంటలను బుధవారం కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతు భరోసా, రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.