MLA Kunamneni | నాగర్కర్నూల్, జనవరి 12: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కూనంనేనిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే స్పష్టం చేశారు. ప్రజల కోసం సీపీఐ రాజీలేకుండా పనిచేస్తుందని అన్నారు. పేదలకు మంచి చేయాలన్నది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు.