హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు కన్నెర్న చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బస్ భవన్ నుంచి సమావేశ ప్రాంగణం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పోకడలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రతి కార్మికుడికి ఊపిరి అందిస్తున్న సంఘం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ అని పేర్కొన్నారు.
భాగంగానే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శంకర్గౌడ్ ఆత్మ బలిదానంతో ప్రభుత్వం దిగి వచ్చి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉన్నంతకాలం ఎంప్లాయీస్ యూనియన్ ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కే పద్మాకర్, అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.