హైదరాబాద్ : సింగరేణిలేని(Singareni )తెంగాణను ఊహించుకోలేం. తెలంగాణకే తలమానికమైన సింగరేణి వేలంలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా నిలబడాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Koonamneni Sambasivarao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన బొగ్గు గనులు మనకు ఉంటాయి. గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించాం. ఇప్పుడు పరి స్థితులు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, ప్రైవేటీకరణతో వారంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడుకోవాలన్నారు. సింగరేణి లేక పోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జూలై 5న బంద్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కల్టెరేట్లను ముట్ట డిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలక పోకుండా ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.