హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కాం గ్రెస్ పార్టీలోకి రారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చెప్పేది నిజం. జరిగేది అదే. రాసిపెట్టుకోండి’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువా రం ఆయన మీడియాతో చిట్చాట్లో మా ట్లాడారు.
ఒకవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే.. గిలితే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కేసుల భయం ఉన్న ఎమ్మెల్యేలు వాటి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ వైపు వెళ్తారు తప్ప కాంగ్రెస్లోకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. తాను తిరిగి పార్టీలో (కాంగ్రెస్) చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఒకవేళ ఇస్తే హోంశాఖ ఇవ్వాలని అడుగుతానని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.