ఆదిలాబాద్ : రానున్న మరో 20 ఏండ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు. జైనత్ మండలం పెండల్వాడలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS )ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు(BJP Leaders) దేవుళ్ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government) అన్ని మతాలు, కులాలను సమానంగా ఆదరిస్తుందని పేర్కొన్నారు. మతతత్వ రాజకీయాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రజల వద్ద నుంచి పన్నులు పెంచడం వల్ల నిత్యావసర ధరల రేట్లు పెంచి తెలంగాణ ఆర్థిక సంపదను దోచుకొని బడా బాబులకు దారదత్తం చేస్తుందని ఆరోపించారు. రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, వంటి అనేక కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎంపీపీ మార్శెట్టి, గోవర్ధన్, బాలూరి గోవర్ధన్, చంద్రయ్య, లింగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.