సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) నిప్పులు చెరిగారు. కండ్ల ముందే నీళ్లు(Irrigation water) పోతున్నా ఇవ్వలేని రండలు కాంగ్రెస్(Congress party) వాళ్లు అని ఘాటుగా విమర్శించారు. శుక్రవారం కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నాడు చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలోనూ నోరు మూసుకున్న రండలు మీరేనని ఆరోపించారు.
ఆరోగ్యం బాగాలేకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాటయోధుడు కేసీఆర్ అని ప్రశంసించారు. జేబులో కతెర పెట్టుకునే వాడు జేబు దొంగనే అవుతాడన్నారు. మంది లాగులు ఊడగొట్టి ఏమి చూస్తావు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. సీఎం అయింది దీని కోసమేనా అని మండిపడ్డారు. కేసులు పెడితే ఏమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని బీరాలు పలుతుకుతున్నారు.
నీవల్ల కాదన్నారు. చంద్రబాబు, వైఎస్ను ఇద్దరిని మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్ది అని గుర్తు చేశారు. నువ్వు జేబు దొంగ కావొచ్చు మొదలు.. ఇపుడు సీఎం అని గుర్తు పెట్టుకో అని హితవు పలికారు. రేవంత్ లాగానే మంత్రి ఉత్తమ్ కూడా ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నాడు. డిసెంబర్ 9 నుంచి ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఎటు పోయాయని ప్రశ్నించారు.
మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కెసిఆర్ ఎప్పుడైనా చేయగలిగిందే చెప్పాడు. చేపిందే అమలు చేసి చూపించారన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను వేదిస్తే ఊరుకోమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.