హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : దేశ రాజధాని వేదికగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నివాసంలో బుధవారం జరిగిన లంచ్ మీటింగ్కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనతోపాటు బీజేపీ ఎంపీలు కే లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఇంటికి ఈటల వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. పరస్పరం ఆత్మీయంగా పలుకరించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని రాష్ట్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ సోషల్ మీడియా, ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయని పేర్కొన్నారు.