నల్లగొండ : రాష్ట్రంలో పాలన అగమ్యగోచరంగా తయారైంది. పంటలు(Crops) ఎండిపోయి అన్నదాతలు ఆగం అయ్యారు. కాంగ్రెస్(Congress) హామీలునమ్మి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. సోమవారం దేవరకొండలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారు.
కేసీఆర్ నల్లగొండ సభలో పెడితే భయపడి కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పంటలు ఎండిపోతే ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ వాళ్లు ఓట్లు దండుకొని, ఇప్పుడు మొఖం చాటేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారుల వద్దకు పోతున్నారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం అని మరోసారి మోసం చేశారు. 200 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు.
అయినా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రులు దద్దమ్మలు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుట్ర అంటూ అన్ని ఫేక్ న్యూసులు, అభూతకల్పనలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ను ఏమీ చేయలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.