హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం పట్ల మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్న వయసులో శాసనసభ్యురాలిగా ప్రజా మన్ననలతో ఎన్నికయిన ఆమె అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమన్నారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున పఠాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. లాస్య నందిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఇదే నెలలో అనారోగ్యంతో మరణించారు. దాంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందితకు కేసీఆర్ కంటోన్మెంట్ సీటు ఇచ్చారు. ఆమె బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.