యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : నీళ్లియ్యక పంటలను ఎండబెట్టిన కాంగ్రెస్ సర్కార్ను రైతులు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి హెచ్చరించారు. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ పేరుతో రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం కోసం అడ్డదారులు తొక్కిందని, ఆ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని జనం బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నీళ్లను కాపాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు అని దుయ్యబట్టారు. వంద రోజుల్లో కాంగ్రెస్సోళ్లు రాష్ర్టాన్ని వందేండ్ల్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగ య్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.