E20 Petrol : ఈ20 పెట్రోల్ (E20 Petrol) వాడటంవల్ల వాహనాల ఇంజిన్లు (Engines) దెబ్బతింటాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం (Union Government) స్పష్టంచేసింది. అయితే ఈ10 పెట్రోల్ (E10 Petrol) కు అనుగుణంగా రూపొందించిన కొన్ని పాత వాహనాల్లో మైలేజీ 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం రాజ్యసభ (Rajya Sabha) కు తెలియజేసింది.
మైలేజీపై ఇథనాల్ శాతంతోపాటు డ్రైవింగ్ తీరు, వాహనం నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, వీల్ అలైన్మెంట్, ఏసీ వినియోగం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని కేంద్రం పేర్కొన్నది. అదే సమయంలో ఈ20 పెట్రోల్తో అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన సామర్థ్యం, ఇంజిన్లో నాకింగ్ తగ్గడం, వాహనం సాఫీగా పికప్ తీసుకోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని వెల్లడించింది.
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ20 పెట్రోల్పై వస్తున్న విమర్శలను ఖండించారు. ఈ20 పెట్రోల్ వల్ల ఏ ఒక్క కారు దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవని, ఇలాంటి ఆరోపణలు తప్పుడు ప్రచారంలో భాగమేనని ఆయన తేల్చిచెప్పారు.