నల్లగొండ : రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఫైర్ అయ్యారు. ఆదివారం మిర్యాలగూడలో(Miryalaguda) బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సన్నాహక సమావే శంలో పాల్గొని మాట్లాడారు. ఫేక్ కేసులు, లీకులు తప్పా కాంగ్రెస్ పార్టీకి(Congress)పాలన చేతకాదన్నారు. నీళ్లులేక పొలాలు ఎండిపోతుంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్య పాలనలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. లగడపాటి రాజగోపాల్ నాఫోన్ ట్యాప్ చేశారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నాం. పోలీసులను ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదన్నారు. ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వమంటే చేతకాని దద్దమ్మలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇక జిల్లా పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతున్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్లో కూడా నీళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు సాగర్లో నీళ్లు ఉన్నా ఇవ్వలేని రండలు, చేతకాని వెదవలు కాంగ్రెస్ వాళ్లు అని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.