Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతాంగానికి రైతుబంధు ఇచ్చి మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అడ్డుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా రైతుబంధు రాలేదు. అధికారంలోకి రాగానే రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. మేం కాంగ్రెస్ లాగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయం. వెంటనే రైతుబంధు ఇవ్వమని కోరుతున్నాం. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ. 25 వేలు నష్ట పరిహారం సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు మేలు జరిగితే.. మేం కాంగ్రెసోళ్ల లాగా అసూయ పడం, ఫిర్యాదు చేయం. స్వాగతిస్తాం.. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలు ముఖ్యం అని హరీశ్రావు స్పష్టం చేశారు.
కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చాం. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు అయ్యాయి. నేరుగా రైతుబంధు పంపిణీ చేశారు. రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా రైతులకు అందించి లక్షకు పైగా రైతు కుటుంబాలను ఆదుకున్నాం. తుమ్మల నాగేశ్వర్ రావు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి పాలేరు నియోజకవర్గంలో సాగునీరు అందించాం. ఇలా రైతులకు మేలు జరిగిదంటే కేసీఆర్ హయాంలోనే. కేసీఆర్ హయాంలో రైతుల మోటార్లు కాలలేదు. నీళ్లకు ఇబ్బంది రాలేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలలేదు అని మహిళా రైతులు స్పష్టం చేశారు. దేవుడి లాంటి కేసీఆర్ను ఓడగొట్టుకొని, దెయ్యం లాంటి కాంగ్రెస్ను గెలిపించుకున్నామని రైతులు పేర్కొన్నారని హరీశ్రావు తెలిపారు.