Harish Rao | సిద్దిపేట : నా బలం.. బలగం యువతే.. వారు తలచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించడానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట కొండమల్లయ్య గార్డెన్స్లో యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి..? 100 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. తెలంగాణ వద్దు అంటూ తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ ఈ రోజు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఏనాడైనా అన్నారా..? బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి.. మెదక్లో చెల్లుతుందా..? సిద్దిపేట అభివృద్ధి అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి అని హరీశ్రావు పేర్కొన్నారు.
యువత ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలి. ఎన్నికల హామీల అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్కు, ధరలతోపాటు నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచిన బీజేపీకి గుణపాఠం నేర్పాలి. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం. యువత తలచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదు అని హరీశ్రావు స్పష్టం చేశారు.