హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్/రవీంద్రభారతి: మనిషిలో మానవత్వ విలువలు పెంపొందించేవిధంగా పనిచేస్తున్న ఐ ఫోకస్ సంస్థ సేవలు అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. విలువలను కాపాడుతూ, స మాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని సంస్థ నేర్పడం గొప్పవిషయమని మెచ్చుకున్నారు. ఉప్పల్లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన ఐ పోకస్ సంస్థ 18వ వార్షికోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి, స మాజ రక్షణ కోసం పనిచేస్తున్న ఐ ఫోకస్ సేవలను కొనియాడారు. విద్యార్థులలో ఏకాగ్రత, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఉ ద్యోగుల్లో సమర్థత, యువతలో చైతన్యం నింపడం, వ్యాపారుల్లో నైపుణ్యం పెం చేలా తోడ్పాటు అందించడం హర్షనీయమని చెప్పారు. కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ముగింపు వేడుకలు శనివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన పలువురు నిపుణులను, సంఘ సేవకులను, కళాకారులను ఘనంగా సత్కరించారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా నాయకత్వంలో సంబురాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సినీనటుడు రాజేంద్రప్రసాద్కు ఆటా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరయ్యారు. ఆటా ప్రతినిధులు ఏ దేశంలో ఉన్నా మృతృభూమిని మరువకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆటా కోశాధికారి సతీశ్రెడ్డి, పూర్వ అధ్యక్షుడు పరమేశ్ భీమ్రెడ్డి, ఈశ్వర్ బండా, అనిల్కుమార్ బో యినపల్లి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కాటపల్లి వెంకటరమణారెడ్డి, యశస్వినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం సాయంత్రం మెట్రో రైలులో ప్రయాణించారు. ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రోలో ప్రయాణిస్తూ ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. నాగోల్ శిల్పారామంలో ఐ ఫోకస్ సంస్థ కార్యక్రమంలో పాల్గొని, రవీంద్రభారతిలో ఆటా కార్యక్రమానికి రావడానికి రోడ్డు మార్గంలో ఆలస్యమవుతుండటంతో మెట్రో ఎక్కారు. ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో వచ్చిన హరీశ్రావు.. అక్కడ దిగి రవీంద్రభారతిలోకి వెళ్లారు.