మెదక్ :మెదక్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం దురదృష్టరమని, తక్కువ మెజార్టీతోనే మెదక్లో ఓడిపోయామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. మెదక్ పట్టణం(Medak)లోని వైస్రాయ్ గార్డెన్స్లో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల(BRS activists) సమావేశానికి హాజరై మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు గెలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వచ్చి పనిచేసి గెలిపిస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లే చెప్పారు.
హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్లు కట్టారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాళేశ్వరం, కొండపోచమ్మల ద్వారా సాగునీరు ఇచ్చిందన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం..బీఆర్ఎస్ అంటే విశ్వాసం . కరోనా వచ్చినా రైతులకు రైతుబంధు వేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదన్నారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెసోళ్లు అసెంబ్లీలో అన్నీ జుటా మాటలు మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ కోసం నేను మెదక్ జైల్లో మూడు రోజులున్న. తెలంగాణతో బీఆర్ఎస్ ది పేగుబంధమని పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపిద్దాం. మెదక్ ఎంపీ గెలవడం పక్కా ఎవరు అధైర్య పడద్దు..భవిష్యత్ మనదేనన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలతో బీఆర్ఎస్ పై ద్రుష్పచారం చేస్తున్నారు. మీకు ఏ కష్టమొచ్చినా గంటలో మీ ముందుంటా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదామన్నారు.