Harish Rao | హైదరాబాద్ : హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్నారు.
నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అని హరీశ్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది.
నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్ అంటూ గతం లో ప్రజలను… pic.twitter.com/wRguagxE7g
— Harish Rao Thanneeru (@BRSHarish) February 27, 2024