అసెంబ్లీలో జీరో అవర్లో ప్రస్తావించిన వాటికి సమాధానాలు రావడం లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తాము ప్రస్తావించిన వాటికి దేనికీ జవాబులు రాకుండా గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ హయాంలో బీసీ ఆత్మగౌరవ భవనాలకు 89 ఎకరాలు, రూ.91కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.