నల్లగొండ : తొలి ఏకాదశి సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు. స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.