నల్లగొండ: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal reddy)నల్లగొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నేడు ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో అన్ని పట్టణాలు, గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత పిలుపు మేరకు తన నివాసంపై జెండా ఎగర వేశామని, నియోజకవర్గంలో ప్రతి రైతు ఇంటిపై నల్లజెండా ఎగిరెలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు పట్టణంలోని అన్ని వార్డులు, నియోజకవర్గంలోని గ్రామాలలోని ప్రతి ఇంటి పై జెండా ఎగురుతుందని ప్రకటించారు.