కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. “దళితబంధు”గురించి బీజేపీ చేస్తున్న తప్పడు ప్రచారం పై కమలాపూర్ లో బాల్క సుమన్ స్పందించారు. దళితబంధుపై బిజేపి చిల్లర రాజకీయాలు చేస్తోందని మండి పడ్డారు. ప్రజలకు మేలు చేసే పథకాలను ప్రసంశించాల్సిందిపోయి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన వివరించారు. “దళితబంధు” పథకం హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని ఇక్కడ సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.