‘Namasthe’ Effect | అలంపూర్, ఫిబ్రవరి 19: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది. ఇందుకు అలంపూర్ మున్సిపల్ అధికారులు స్పందించారు. న్యూప్లాట్స్ కాలనీలోని బోర్లకు మర్మతులు ప్రారంభించారు.
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను సరిచేశారు. సాయంత్రం వరకు కాలనీలో కొన్ని ఇండ్లకు నీటిని సరఫరా చేశారు. దీంతో స్థానికులు ‘నమస్తే’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ నల్లాల సంఖ్య పెరగడంతో చివరి ఇంటి వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. పైపుల సైజు పెంచాలని, అక్కడక్కడా ఎయిర్ వాల్వ్స్ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు వివరించారు.