నాగర్కర్నూల్, మార్చి 4: నాగర్కర్నూల్ జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని గర్భానికి కారణం బాలుడు కాదని, బంధువు అని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం మీడియాతో డీఎస్పీ మాట్లాడుతూ.. ఓ బాలిక కడుపునొప్పి రావడంతో తల్లితోపా టు దవాఖానకు వచ్చి నాగర్కర్నూల్లోని ఓ స్కానింగ్ సెంటర్లో ప్రసవించిందని తెలి పారు. మొదట బాలుడి ద్వారా గర్భం దాల్చినట్లుగా బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిదని చెప్పారు. బాలిక ఇంటి పక్కనే ఉంటున్న దగ్గరి బంధువు ఇద్దరు పిల్లల తండ్రి అయిన గంగరాజు పదో తరగతి చదువుతున్న సమయం నుంచే బాలికను ప్రేమపేరుతో మోసం చేశాడని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం పరీక్ష రాసి కడుపునొప్పి వస్తుందని తల్లితో నాగర్కర్నూల్లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చి స్కానింగ్ సెంటర్లోనే ప్రసవించిందని తెలిపారు. మొదట బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఆ తర్వాత అసలు నిజం చెప్పిందని డీఎస్పీ వెల్లడించారు.