మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హరీశ్ రావు పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడారు. త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు. డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు.
మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. పేద ప్రజలు ఎంతో నమ్మకంతో దవాఖానకు వస్తారని, వారికి మంచి సేవలు అందించాలన్నారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రుల వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.