సంగారెడ్డి : కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు లేవట్టే వారు. కానీ టీఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశాం. జిల్లాలో 54 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. ప్రతి కొత్త బిల్డింగ్ కు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాఠశాల లేదు.
భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు పాఠశాలలు మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. నీళ్లు మోసి భుజాలు కాయలు కాసేవి. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నాం. కానీ, బీజేపీ జూట మాటలు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏముంది? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. పక్కన ఉన్న కర్ణాటకలో డబుల్ ఇంజిన్.. ఎందుకు 500 పింఛన్ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇక్కడి లాగే ఎందుకు 2016 ఇవ్వడం లేదని నిలదీశారు. కాన్పు కావాలంటే నాడు బీదర్ పోయేవాళ్లు. ఇప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తున్నారని మంత్రి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా మారి పోయాయో ఆలోచించాలన్నారు. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఎఅన్ని తండాలకు రోడ్లు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్కు గిరిజనులు అంటే ఎంతో ప్రేమ అన్నారు.