నిజామాబాద్ :మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ను రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ ఓపీ సేవలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న చికిత్సపై డాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పనులు, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ సందర్భంగా పరిశీలించారు.
వ్యాక్సినేషన్ క్యూలైన్లో ఎక్కువ మంది నిల్చొని ఉండడాన్ని గమనించిన మంత్రి వారితో మాట్లాడారు. హాస్పిటల్కు వచ్చే వారికి తాగడానికి వాటర్, కూర్చోవడానికి కుర్చీల సమస్య లేకుండా చూడాలని హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించారు.
మంత్రి స్నేహితుల సహకారంతో బాల్కొండ నియోజకవర్గం లోని అన్ని సర్కిల్ హాస్పిటల్స్, పీహెచ్సీలలో వసతులు కల్పించడానికి కోటికి పైగా నిధులు సమకూర్చిన విషయం తెలిసిందే. ఆ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ పనులను ఈ రోజు మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం