హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. దూల్పూర్ రెడ్ స్టోన్ రాతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఎలివేషన్ వచ్చే జీఆర్సీ క్లాడింగ్ పనులు, రౌండ్ పిల్లర్ల నగిషీల పనులు, గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. యూపీవీసీ విండో పనులు, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మిగిలి ఉన్న సివిల్ పనుల్లో వేగం పెంచాలన్నారు.
మంత్రుల చాంబర్స్, వుడ్ వర్క్, ప్యానెలింగ్, శానిటరీ ఫిక్చర్స్, ఇంటీరియర్ వర్క్స్, కోర్ట్ యాడ్ ఎలివేషన్, ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించారు. కాంపౌండ్ వాల్కి వచ్చే రేయిలింగ్, సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్థనా మందిరాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయం, మసీదు, చర్చి, సెక్యూరిటీ బ్లాక్ తదితర పనులను పర్యవేక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని, ఈ మేరకు కూలీల సంఖ్యను పెంచాలని చెప్పారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మంతి వెంట ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, పలువురు ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.