గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా మార్చుకొన్నారని, ఆమెకు గవర్నర్గా కొనసాగే అర్హతే లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమెకు గవర్నర్గా కొనసాగే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో పంపితే రాజకీయ నేపథ్యం ఉన్నదని రిజెక్ట్ చేయడం దుర్మార్గమని ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్డ్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణను తిరస్కరించడం యావత్ తెలంగాణ ఎంబీసీ కులాలను, ఎస్టీ(ఎరుకల) సమాజాన్ని అగౌర పర్చినట్టే అభిప్రాయపడ్డారు.
రాజకీయ నేపథ్యం ఉన్నదని తెలంగాణ ఉద్యమకారులను అవమానపర్చిన గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్ గా తెలంగాణ గవర్నర్ గా నియమించబడలేదా..? తమిళిసైకి నైతిక విలువలు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరారియా కమిషన్ సూచనలు తుంగలో తొకి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్ గా నియమించారని, ఇది పూర్తిగా సరారియా కమిషన్ సూచనలకు విరుద్ధమన్నారు. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.