వేల్పూర్, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి నేరచరిత్రేనని, పదవుల కోసం ఎంతకైనా తెగిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీని కత్తితో పొడవడం దారుణమని, అభ్యర్థులను అంతమొందించాలనుకునే ఆలోచన దుర్మార్గమని ధ్వజమెత్తారు.
మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్పై దాడిని తీవ్రంగా ఖండించారు. గతంలో హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి వందల మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో 10 మంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు.