కమ్మర్పల్లి, అక్టోబర్ 26: కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్, మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో మాట్లాడారు. రైతుబంధు, దళితబంధును ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండించారు.
యాసంగి పంట పెట్టుబడి అవసరం ఉన్న వేళ రైతు బంధును ఆపితే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా రైతుబంధును ఆపాలని కోరడం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడాన్ని ఖండిస్తూ మంత్రి వేముల ప్రతిపాదించిన తీర్మానానికి కార్యకర్తలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.