కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కమ్మర్పల్లిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమ్మర్పల్లిలో రూ.2.50 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగాలు లేవనేది అబద్ధపు ప్రచారమన్నారు. రాష్ట్రం లో 1.32 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంచేశారు. బీజేపీ పాలిత యూపీలో 19 వేలు, బీహార్లో 8,950, కర్ణాటకలో 14,893, మహారాష్ట్రలో 8 వేల ఉద్యోగాలను మాత్ర మే పీఎస్సీ ద్వారా భర్తీ చేశారని చెప్పారు. ఈ లెక్కలు అబద్ధమైతే తన పదవికి రాజీనామా చేస్తానని, నిజమై తే బీజేపీ నేతలు రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు.