నిజామాబాద్ : భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామినాథన్ పరిశోధనలతో దేశంలోని ఆహార కొరతను తీర్చారని కొనియాడారు. ఆయన కృషి వల్ల దేశీయంగా ఆహార స్వయం సమృద్ధి సాదించామని తెలిపారు.
ఆయన పరిశోధనలతో అధిక దిగుబడులు సాధించడం ద్వారా రైతుల ఆధాయం మెరుగుపడిందని, స్వామినాథన్ మృతి భారతీయ వ్యవసాయ రంగానికి తీరని లోటు అని అన్నారు. స్వామినాథన్ సేవలు యావత్ రైతులోకం ఎన్నటికీ మరువదన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి వేముల ప్రార్థించారు.