Minister Vemlula Prashanth Reddy : హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రైతులు, పేదలు రెండు కండ్లుగా తెలంగాణ రాష్ట్రా న్ని సుభిక్షం చేసిన సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Vemlula Prashanth Reddy) అన్నారు. కేసీఆర్ లాంటి పాలన దేశానికి అవసరమనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నదని ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి(Kammrpally) మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, రైతు నాయకులు బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అయ్యిందని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్వన్గా నిలిచిందని వేముల అన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనిక మాడల్ను ఇవ్వాళ యావత్ దేశం కోరుకుంటున్నదని, అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మాడల్ అభివృద్ది కావాలని డిమాండ్ చేయటం ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణమని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలన, పార్టీ విధానాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరిన ప్రతీ ఒక్కరికి పార్టీ, వ్యక్తిగతంగా తానూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరినవారిలో పన్నాల గంగారెడ్డి, ముత్యాల లక్ష్మణ్ గౌడ్, సింగిరెడ్డి ముత్యం రెడ్డి, సింగిరెడ్డి గంగారెడ్డి, కూలిపాటి గంగారెడ్డి, గోవింద్ గంగాధర్, కొమ్ములు కిషన్, రైతు నాయకులు కొమ్ములు రాజేందర్, కొమ్ములు శ్రీధర్, కొమ్ములు మహిపాల్, సింగిరెడ్డి బాలకృష్ణ, సింగిరెడ్డి బాల్రెడ్డి, వేముల మోహన్రెడ్డి, వేముల శివారెడ్డి, రేంజర్ల రోహిత్రెడ్డి, సింగిరెడ్డి జలపతిరెడ్డి, గోపిడి రాజేందర్, సంత రాజేందర్, కొమ్ముల రాజేందర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ ప్రెసిడెంట్ రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, అహ్మద్, లుకా గంగాధర్, బద్దం చిన్నారెడ్డి, బద్రి రాజేశ్వర్, హల్దే శ్రీనివాస్, సుమన్, సంత రాజేశ్వర్, కో- ఆప్షన్ సభ్యుడు పాషా, సుధాకర్, హరీష్ రెడ్డి, మహేందర్, బొడ దేవేందర్, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.