హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. తాగునీటి భద్రత, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో భూగర్భజల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ విషయంలో రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, కొత్త బోరుబావుల తవ్వకాలు, అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పైనా సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి శ్రీధర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్ పాల్గొన్నారు.