సూర్యాపేట : మళ్లీ బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. సూర్యాపేట(Suryapet) జిల్లా మోతెలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతున్నది.
మతవిద్వేషాలు రెచ్చగొడుతూ ఆ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. మరోసారి అవకాశం ఇస్తే దేశాన్నే అమ్ముకుంటారని విమర్శించారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ను గెలిపిం చాలన్నారు. ఆయన వెంట నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తదితరులు ఉన్నారు.