మామిళ్లగూడెం, ఏప్రిల్ 30: రైతుబంధు ఆగింది నిజమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. రైతుబంధు తనకే రాలేదని, ఈ విషయమై పెద్దాయనను అడిగితే ఫస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇద్దామని చెప్పినట్టు తుమ్మల పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖున వేతనాలు ఇస్తున్నందున రైతుబంధు సకాలంలో ఇవ్వలేక పోయామని స్పష్టం చేశారు.
మంగళవారం ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లిస్తున్నందున తమ శాఖకు బడ్జెట్ విడుదల కాకపోవడంతో రైతుబంధును రైతుల ఖాతాల్లో జమచేయలేక పోయినట్టు వివరించారు.