హైదరాబాద్: స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav)అన్నారు. హైదరాబాద్లో ఉన్న హాస్పిటాలిటీ ఎక్కడా లేదన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా జీహెచ్ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్నగర్లోని జీహెచ్ఎంసీ వెల్ఫేర్ గ్రౌండ్లో తలసానితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. స్వచ్ఛతలో హైదరాబాద్కు ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. నగరంలో పార్కులు, రోడ్లు, బస్ షల్టర్లు సుందరంగా మారాయన్నారు.
నగరవాసులు స్వచ్ఛ ఆటోలను ఉపయోగించుకోవాలని సూచించారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను గ్రీన్సిటీగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.