హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని, అవసరమైతే నిబంధనలు సడలిస్తామని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మ త్స్యకారుల జేఏసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల వృత్తి నైపుణ్యాన్ని పెం పొందించేందుకు జిల్లాల్లో శిక్షణ కేం ద్రా లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. రాష్ట్రం లో మత్స్యసంపద భారీగా పెరిగినందున అన్ని జిల్లాల్లో చేపల విక్రయ కేం ద్రాలు నెలకొల్పనున్నట్టు చెప్పారు. చె రువుల కబ్జాను అడ్డుకొనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేఏసీ ఏర్పాటు తో మత్స్యకారుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు దీటి మల్లయ్య, పలు జిల్లాల గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.