హైదరాబాద్ : పశు సంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమీక్ష ర్వహించారు. మసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో గొర్రెలు, పాడిగేదెలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్లను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు సుకోవాలని అధికారులను ఆదేశించారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సబ్సిడీపై, గొర్రెలు, పాడిగేదెలను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రమాదవశాత్తు జీవాలు మరణిస్తే లబ్ధిదారులు నష్టపోకుండా ఆదుకునేందుకు ఇన్సురెన్స్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జరిగిన గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, రెండో విడుత పంపిణీ ప్రక్రియ, దాంతో పాటు ఇన్సురెన్స్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను రాబోయే 15 రోజుల్లో పరిష్కరించాలని లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 3,86,366 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు త్వరలో గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పాడిగేదెల కోసం డీడీలు చెల్లించిన వారికి గేదెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు పాల ఉత్పత్తి చేపట్టాలని, అలాగే నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్లపై ఫుష్కార్ట్ల ద్వారా విజయ ఐస్ క్రీమ్లను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందించేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యాకారుడిని మత్స్య సొసైటీలలో సభ్యుడిగా నమోదయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై, అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
మత్స్యశాఖకు ఇటీవల బదిలీ అయిన గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలకు సంబంధించిన లీజు మొత్తాన్ని నిర్ణయిచేందుకు సమగ్రమైన సమాచారం కోసం ఉన్నత అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తదుపరి జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అదర్ సిన్హా, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైరెక్టర్ రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణి తదితరులు పాల్గొన్నారు.