Minister Harish Rao | అందోల్/హైదరాబాద్, అక్టోబరు 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో శుక్రవారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. అందుకే ప్రజలకు ఆయనపై అపారమైన ప్రేమ ఉన్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అల్లాదుర్గం మండల మాజీ జడ్పీటీసీ దంపతులు కంచరి మమత, బ్రహ్మంతోపాటు రేగోడ్, అల్లాదుర్గం మండలాల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ సరిల్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏ కల్పనారెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్వర్యంలో, అంబర్పేట శంకరన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి. అందోల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఫారూఖ్హుస్సేన్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, మండల అధ్యక్షుడు మహేశ్గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు శేఖర్, బీజేపీ యూత్ అధ్యక్షుడు మహేశ్గౌడ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.