మహబూబ్నగర్ టౌన్, జూన్ 12: పాలమూరును సుందరంగా తీర్చిదిద్ది గ్రీన్ సిటీగా మార్చుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్లోని బీకేరెడ్డి కాలనీలో మంత్రి పర్యటించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసిన చాయ్ కేటిల్, కప్ వాటర్ ఫౌంటెయిన్ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ను గ్రీన్ సిటీగా మారుస్తామని చెప్పారు. కాలనీ పర్యటనకు వచ్చిన మంత్రిపై స్థానికులు అభిమానంతో నేరుగా పూల వర్షం కురిపించి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అభిమానులు మంత్రిని భుజాలపై ఎత్తుకొని సంబురపడ్డారు.